జోహరాపురం వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి : జనసేన నాయకులు పవన్ కుమార్

    కర్నూలు, (జనస్వరం) : కర్నూలు పాత నగరం నుండి జోహరాపురంను కలిపే వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కర్నూల్ నగరంలోని జోహరాపురం వంతెన నిర్మాణ పనులను జనసేన పార్టీ కర్నూలు జిల్లా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కుమార్ మాట్లాడుతూ 2018లో గత టిడిపి ప్రభుత్వం హయాంలో జోహరాపురం వంతెన నిర్మాణం పనులు ప్రారంభించినప్పటికీ నేటికీ పూర్తి కాకపోవడం దుర్మార్గమైన విషయం అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019లో జోహరాపురం వంతెన నిర్మాణం పనులపై వైసీపీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కర్నూలులో నిరసన కార్యక్రమం చేపట్టిన ఇప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. ప్రజలకు నిత్యం ఉపయోగపడే జోహరాపురం వంతెన నిర్మాణం పనులకు వెంటనే నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాలిక్, మహబూబ్, శశావల్లి పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way