ఓట్లు వేసి ఇంట్లో ఎలా కూర్చుంటారు, నిలదీయాల్సిన బాధ్యత మీకు లేదా? జనసేన నాయకులు తెర్నేకల్ వెంకప్ప

    ఆలూరు, (జనస్వరం) :  ఓట్లు వేసి ఇంట్లో ఎలా కూర్చుంటారు, నిలదీయాల్సిన బాధ్యత మీకు లేదా అని చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామ ప్రజలతో కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ తెర్నేకల్ వెంకప్ప సమావేశం నిర్వహించారు. రోడ్లు, సిసి రోడ్లు (రంపురయ్య విధి) , త్రాగునీరు సమస్యల పైన నేమకల్లు ప్రజలతో చర్చించారు. ఇంతవరకు ఒక్క పని కూడా జరగలేదు అని అక్కడున్న పెద్దలు మరియు మహిళలు చెప్పారు. నవరత్నాలు దేవుడెరుగు ముందు మౌలికసదుపాయాల మీద దృష్టి సారించండి. వైయస్సార్ సిపి ప్రభుత్వంలో ఏ సర్పంచ్ సంతోషంగా లేడు. గ్రామాల్లో కాంక్రీట్ రోడ్లు వేయడానికి సర్పంచులు మరియు అధికారులు భయపడుతుంటే (బిల్లులు ఎక్కడ కాలగర్భంలో కలిసి పోతాయని) అలాంటిది ప్రాజెక్టులు కడతారా? గ్రామానికి వచ్చే నిధులు కూడా మీరు ఓట్ల రాజకీయం కోసం మళ్లిస్తున్నారు. గ్రామల అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way