ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి : జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి

    అనంతపురం, (జనస్వరం) : తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ స్పూర్తి అద్భుతమని ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఉద్యోగుల సమస్యలన్నిటిని తక్షణమే పరిష్కరించాలని జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఉద్యోగుల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్న అర్థం కావడం లేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడ చేసిన తప్పే ఇప్పుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారన్నారు. పొరుగు సేవలు ఒప్పంద, బేసిక్ ఉద్యోగుల సమస్యలను నాడు చంద్రబాబు నాయుడు, నేడు జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అప్పట్లో బాబు వస్తే జాబు వస్తుందని నమ్మబలికి తనకు అధికారం అప్పగిస్తే 1.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు మాట తప్పారన్నారు. నేడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మబలికి మాట తప్పడు అన్నారు. చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరూ ఒకటేనని ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి నిలబడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉద్యోగులు, నిరుద్యోగులు బాసటగా నిలిస్తే వారి సమస్యలని నిజాయితీగా పరిష్కరిస్తారు అన్నారు. ఉద్యోగులు నిరుద్యోగులకు ఎప్పుడు జనసేన అండగా నిలుస్తుందని.. చలో విజయవాడలో ఉపాధ్యాయ ఉద్యోగులు చూపిన ఉద్యమ స్ఫూర్తి వైసిపి ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way