స్వాతంత్ర్య ఫలాలు అందరికీ చేరువ కావాలి : గుంటూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు

    గుంటూరు, (జనస్వరం) :  స్వాతంత్ర్య ఫలాలు ప్రజలందరికీ చేరువ కావాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు అభిలాషించారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలమైన స్వతంత్రాన్ని పరిరక్షించుకునే  బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పూర్తిగా ఆమోదించబడిన రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని, గణతంత్రం అనగా ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలని అర్ధం అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పుట్టినందుకు భారతీయుడిగా ప్రతీక్షణం గర్వపడతామని అన్నారు. కార్యక్రమంలో జనసైనికులు ఆళ్ళ హరి, దాసరి వెంకటేశ్వరరావు, మహంకాళి శ్రీనివాస్, ఇల్లా శేషు, కానవరపు శ్రీనివాస్, మధులాల్, అలా కాసులు, కిషోర్, నాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way