యస్ కే యూనివర్సిటీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి వేడుకలు

భగత్ సింగ్

     యస్ కే యూ, (జనస్వరం) : స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా యస్ కే యు భగత్ సింగ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు హెన్రీ పాల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం నేతాజీ చేసిన పోరాటం, త్యాగం, ఆయన ధైర్యం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. భారత స్వతంత్ర సమర యోధుడు, అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో, మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి యస్ కే యూనివర్సిటీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం తరుపున 125 జయంతి శుభాకాంక్షలు తెలియజేసారు. స్వాతంత్ర సమర యోధులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ “నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రాన్ని తెస్తాను” అని వారి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పిస్తూ వారికి దేశం పట్ల ఉన్న భక్తి, మనందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమంలో యస్ కే యూనివర్సిటీ భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు లోకేష్, మధు వంశీ, దివాకర్, రాజు తదితర విద్యార్థి, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way