జనసేన వీరమహిళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన “TeamNandalurJanasena” నాయకులు

   రాజంపేట, (జనస్వరం) : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరుమండలం ఆడపూర్ లో పంచాయతి ఎన్నికలలో సర్పంచ్ గా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన వీరమహిళ కొడుకుకి ఆరోగ్యం బాగలేక ఆపరేషన్ ఖర్చులకి ఇబ్బంది పడుతున్నారు అని మస్తాన్ రాయల్ “TeamNandalurJanasena” నాయకులకి తెలియజేయడంతో వెంటనే వెళ్ళి స్వయంగా వారి సమస్యను తెలుసుకోవడం జరిగింది. “TeamNandalurJanasena” నాయకుల సహాయంతో తొలి విడతగా వారికి 12వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకు మరియు ప్రజలకు ఏ ఆపద వచ్చిన జనసేనపార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం చేసిన వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆడపూరు శ్రీకాంత్, అనీల్, బాలు, లక్ష్మి నారాయణ, మండెం రాము, టంగుటూరు ఈశ్వర్, కళ్యాణ్, అరుణ్ పాండ్య, ఎర్రిపాపల్లిసుబ్బు, సుబ్రమణ్యం, మారుతీ, నాగఆర్య, నందూ, నందిమాయపల్లి ప్రశాంత్, కుమ్మరపల్లి సాయి, ప్రకాష్, తిప్పాయపల్లి ప్రశాంత్, మంకు వెంకటేశ్, ఉపేంద్ర, గురివిగారి వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way