30సం. క్రితం ఇంటినుంచి తప్పిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఎచ్ఛర్ల జనసైనికులు

30సం. క్రితం ఇంటినుంచి తప్పిపోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఎచ్ఛర్ల జనసైనికులు

                  సోషల్ మీడియా ఒకవ్యక్తిని కుటుంబ సభ్యులకు కలిపింది.. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన కాళిశెట్టి శ్రీహరిరావు గత30 సంవత్సరాల క్రితం ఇంటినుంచి తప్పిపోయాడు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం రణస్థలం గ్రామంలో చిన్ని ప్రమాదం జరిగింది. అక్కడే ఉన్న ఎచ్చెర్ల కి చెందిన జనసైనికులు శ్రీహరిరావు కాపాడి అతన్ని హాస్పిటల్ చికిత్స చేయించారు. అతని వద్ద వివరాలు సేకరించిన జనసైనికులు సువ్వాడరామారావు, ఉద్వలఅంజిబాబు, దన్నాన చిరంజీవిలు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంలో రాజోలు చిరుపవన్ సేవాసమితి అధ్యక్షుడు గుండాబత్తుల తాతాజీ, కోళ్ళబాబి, సూదామోహన్ రంగా, తాటిపాకలో శ్రీహరిరావుఇంటికి వెళ్ళి వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచార అందించారు. వెంటనే ఎచ్చెర్ల జనసైనికులను సంప్రదించి వారి ద్వారా సోమవారం రాజోలు జనసైనికుల సహకారంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు చెల్లి కాళిశెట్టి అనంతలక్ష్మి మాట్లాడుతూ తన అన్న 30సం క్రితం ఇంటినుంచి తప్పుకుపోయాడని ఈరోజు తనని చూడటం చాలా ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ,జనసైనికులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని ఎంతమందికి మంచి కార్యక్రమాలు చేస్తున్నా జనసైనికులకు రుణపడి ఉంటామని అనంతలక్ష్మి తెలిపారు.. శ్రీహరిరావును కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంలో కృషి చేసిన ఎచ్చెర్ల జనసైనికులను అభినందించారు.