
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, ఆర్ కె వి బి పేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1వ వార్డు అభ్యర్థిగా జయచంద్రా రెడ్డి నామినేషన్ దాఖలు చేసాడు. అయితే ఇతనికి ముగ్గురు శిరీష, నవ్య, కార్తీక్ అనే పిల్లలు ఉన్నారని జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి యుగంధర్ పొన్న తెలిపారు. పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఇలాంటి వారిని వెంటనే వార్డు మెంబరుగా తొలగించి, రాజ్యాంగపు విలువలను కాపాడాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ని కోరారు. చట్టంమంటే గౌరవం లేదని, నిబంధనలను పాటించని ఎంతటి వారైనా శిక్షించాలని ఈ సందర్బంగా తెలియజేసారు. అధికారం మాదే ప్రభుత్వం కూడా మాదే, షరతులు వర్తించవు అన్న చందంగా పరిపాలని ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో చట్టం పట్ల గౌరవం పెంచాలని, అయితే ప్రజల్లో అసహనం పెరిగిందని తెలిపారు. కాబట్టి జయ చంద్ర రెడ్డిని వార్డ్ మెంబెర్ గా తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, నియోజకవర్గం కోఆర్డినేటర్ రాఘవేంద్ర పాల్గొన్నారు.