పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తే సహించేది లేదు

పవన్‌ కళ్యాణ్‌

         ధర్మవరం ( జనస్వరం ) : పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తే సహించేది లేదంటూ ఖబర్దార్  అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా వారి స్వగృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ ఎవరితోనైనా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారని, అడగడానికి వైసిపి మంత్రులు ఎవరని వారు ప్రశ్నిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు వైసిపి పాలనలో విసుగు చెందారని, ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారని, 2024లో ప్రజలు తప్పక వైసిపి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అభద్రత భావన ఉండటం వల్లనే తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై జగన్‌ తో పాటు మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కలిస్తే వైసిపి మంత్రులకు వచ్చిన నష్టమేమో మాకు అర్థం కాలేదని తెలిపారు. మంత్రులు రోజా, పేర్ని నాని, కొడాలి నాని లు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని ఇకపై మా కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకుండేది లేదని వారు గట్టిగా హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షాలు ప్రశ్చిస్తే, పోలీసులతో కేసులు పెట్టించినంతమాత్రాన, భయపడేది లేదని వారు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way