రేషన్ బియ్యం ఇవ్వకుండా పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైసీపీ ప్రభుత్వం

      పెందుర్తి ( జనస్వరం ) :  88వ వార్డ్, నరవ గ్రామంలో సుమారు 250 కుటుంబాలకు రేషన్ బియ్యం, సరుకులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బాధిత కుటుంబాలు తరఫున జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో వినత పత్రం ఇవ్వడం జరిగింది. శ్రీకాంత్ గారు మీడియా తో మాట్లాడుతూ నరవ గ్రామంలో ప్రతినెల రేషన్ సరుకులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజలను ఇబ్బంది పెడుతుందని, ఈ నెలలో సుమారు 250 కుటుంబాలకు టైం అయిపోయింది కావున మీకు రేషన్ సరఫరా చేయలేమని కుంటి సాకులు చెబుతూ, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య అవగాహన లేకపోవడం వలన ప్రతినెల ప్రజల ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కసారి రేషన్ బియ్యం సరిపడినంత రావడం లేదని, మరొక్కసారి బియ్యం సరఫరా చేసే వాహనం ఉద్యోగులు అందుబాటులో లేరని, సర్వర్ డౌన్ గా ఉంది పనిచేయడం లేదని, డేట్ అయిపోయింది సర్వర్ పనిచేయదు అని కొంటెసాకులతో ప్రజలను ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వ నూతన విధానం వలన ప్రజలుఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజలకు ఈ రేషన్ సరుకులు తీసుకోవడం కోసం పడిగాపులు కాస్తూ అర్ధరాత్రి సమయంలో కూడా రేషన్ బియ్యం తీసుకుంటున్నారని అన్నారు. ఈనెల సుమారు 250 కుటుంబాలకు ఉద్యోగస్తుల మధ్య సఖ్యత లేకపోవడం వలన బియ్యం సరఫరా జరగలేదని వీటిపై ఆధారపడి జీవనం గడుపుతున్న పేద ప్రజలకు ఏవిధంగా బతకాలని ఆగ్రహించారు. ఉన్నతాధికారులకు తెలియజేసిన వారు నుంచి ఏటువంటి స్పందన లేదని, వెంటనే స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అదీప్ రాజు గారు కార్పొరేటర్ ముత్యాల నాయుడు గారు స్పందించి పేద ప్రజలకు బియ్యం సరఫరా అయ్యేలాగా కృషి చేయాలని, మీడియా ప్రతినిధులు కూడా ఈ సమస్య ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి మిగిలిన కుటుంబాలకు న్యాయం జరిగేలాగా సహకరించాలని కోరడం జరిగింది. స్థానిక వీఆర్వో శంకర్రావు గారు వివరణ ఇస్తూ 250 కుటుంబాలకు రేషన్ ఇవ్వాల్సి ఉంది, చివరి తేదీ అయిపోవడం వల్ల సరఫరా చేయలేకపోయామని, రెండు రోజులు సర్వర్ పని చేయలేదని, రెండు రోజులు మాకు రావాల్సిన బియ్యం రాలేకపోవడం వల్ల సరఫరా చేయలేదని, మాకు ఈ సమస్య ప్రతినెల వస్తుందని ఉన్నతాధికారులు కు ఈ సమస్యను తెలియజేశామని వివరణ ఇవ్వడం జరిగింది. బాధిత మహిళలు మాట్లాడుతూ రేషన్ బియ్యం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న మేము ఏ విధంగా బతకాలని, ఈ సమస్య ప్రతినెల మా గ్రామంలో ఏదో ఒక క్లస్టర్ లో ఉన్న ప్రజలు కు ఈ సమస్య వస్తుంది, మూడు నెలల క్రితం కూడా ఇదే సమస్యపై మేము పోరాటం చేస్తే మాకు రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది అని, రేషన్ ఏ సమయంలో సరఫరా చేస్తారో కూడా మాకు తెలియడం లేదని దీనికోసం పనులు మానుకొని పడిగాపులు కాయవలసి వస్తుందని, పాత పద్ధతే మాకు సౌకర్యవంతంగా ఉంటుందని, మాకు రేషన్ బియ్యం లేకపోతే మా కుటుంబం ఈనెల ఏ విధంగా మేము బతకాలని ఓట్లు కోసం ఈ నాయకులు వస్తారే ఈ సమస్య పై ఎందుకు నాయకులు రావడం లేదు అని, ఈరోజు జనసేన పార్టీ ఉంది కాబట్టి మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు, మూడు నెలల క్రితం కూడా మాకు జనసేన పార్టీ అండగా నిలబడడం వల్ల రేషన్ బియ్యం సరఫరా జరిగిందని మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో బొడ్డు నాయుడు, గవర శ్రీను, రాడీ పెంటారావు, ప్రసాద్, మరియు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way