యువత శక్తివంతంగా ఎదగాలి : మలిశెట్టి వెంకటరమణ

     రాజంపేట ( జనస్వరం ) : యువత క్రీడారంగం, రాజకీయ రంగమే కాక అన్ని రంగాలలోనూ రాణించి శక్తివంతంగా ఎదిగి దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ అన్నారు. గురువారం వీరబల్లి మండలానికి చెందిన ఈడిగ పల్లె, వడ్డి పల్లె గ్రామాల యువకుల కోరిక మేరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు సాధన కోసం మలిశెట్టి వెంకటరమణ ఇరుజట్ల కెప్టెన్లకు ఒక్కొక్కరికి రూ 10 వేలు చొప్పున రూ 20 వేలు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఇండేన్ గ్యాస్ వద్ద గల తమ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువు పట్ల మక్కువ పెంచుకొని, ప్రతి దినము వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా, సౌష్టవంగా ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికలవేళ నేతలు వెదజల్లే డబ్బులు కోసం ఆశ పడకుండా రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతి వంటి అభివృద్ధి పనుల కోసం అధికారులను, నేతలను నిలదీయాలని అన్నారు. గ్రామ గ్రామాన ఇందుకోసం యువత నడుం బిగించాలని, అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న ఎన్నికలలో టిడిపి, జనసేన కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, శ్రీనివాసులు, చౌడయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి,కత్తి సుబ్బరాయుడు, పోలిశెట్టి రజిత, శిరీష, వీరబల్లి మండలం వడ్డీ పల్లె క్రికెట్ జట్టు కెప్టెన్ బాలచంద్ర, ఈడిగపల్లె జట్టు కెప్టెన్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way