Search
Close this search box.
Search
Close this search box.

కేతంరెడ్డి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన యువకులు

కేతంరెడ్డి

      నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 110వ రోజున 13వ డివిజన్ బాలాజీనగర్, ప్రాగ్జ్యోతి స్కూల్ ప్రాంతంలో జరిగింది. నేటి పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో తేజ, రోహిత్, సయ్యద్ సమి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన 50 మంది యువకులు జనసేన పార్టీలో చేరారు. కేతంరెడ్డి వారికి పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహం, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట పట్ల ఆకర్షితులై పలువురు యువకులు నేడు పార్టీలో చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలుస్తానని, రేయింబవళ్లు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని, రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way