Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారి ధాటికి వైసీపీ గాడిదలు మూలుగుతున్నాయి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

పవన్ కళ్యాణ్

        నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 217వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ పాలబూత్ సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సాయం చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుని తన స్వంత నిధులతో 3వేల కుటుంబాలకు తలా లక్ష రూపాయల సాయం చేస్తున్నారని అన్నారు. ఇది ఓర్వలేని వైసీపీ మంత్రులు, నాయకులు పవన్ కళ్యాణ్ గారిపై పడి ఏడుస్తున్నారని, నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ గారు గాడిదలు అనగానే గాడిదల కంటే ముందు వైసీపీలోని వారే తమను తాము గాడిదలుగా భావించుకుని ఓండ్ర పెడుతూ మూలుగుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి రథం పై త్వరలో చేపట్టనున్న యాత్ర గురించి వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటినుండే గుబులు మొదలైందని, ఏది ఏమైనా గాని పవనన్నని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way