Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ యే జనసేన పార్టీ ధ్యేయం : చిలకం మధుసూదన్ రెడ్డి

చిలకం మధుసూదన్ రెడ్డి

         ధర్మవరం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ విముక్తి ఆంధ్ర ప్రదేశ్ యే జనసేన పార్టీ ధ్యేయమని పవన్ కళ్యాణ్ లక్ష్యమని వైసీపీ పార్టీని గద్దె దింపాలని పవన్ కళ్యాణ్ గారు నడుము బిగించి బిజెపి పెద్దలతో మంతనాలు చేశారని పేర్కొన్నారు. ఎందుకంటే ఒక దుర్మార్గమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎంత నష్టపోతారో తెలియజేసి ఇక్కడ జరుగుతున్న అవినీతి, అక్రమాలు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ విముక్తి కోసం సన్నద్ధం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ సంప్రదించారని తెలియజేశారు. అదేవిధంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎప్పుడు ఎవ్వరూ విమర్శలు చేసిన ఛాలెంజ్ లు చేయడం వదిలేసి నేను అవినీతికి పాల్పడలేదని కాణిపాకం స్వామివారి మీద ప్రమాణం చేసి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way