ప్రజా సమస్యలు పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యే : నాసిర్ అహ్మద్

వైసీపీ

       చంద్రగిరి ( జనస్వరం ) : ఎంతో మంది ప్రజా ప్రతినిధులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ దామలచెరువు తలరాత మారటం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకాల మండలంలోనే 2 వ అతిపెద్ద పంచాయతీ. సంవత్సరానికి 3 నెలలు మామిడి వ్యాపారానికి పెట్టింది పేరు. మండలానికి రెవిన్యూ జనరేట్ అవుతోంది కూడా ఎక్కువగా దామలచెరువు నుండి. ఇవ్వన్నీ పేరుకే గానీ అభివృద్ధి మాత్రం శూన్యం. దామలచెరువులో పూర్తిగా సిమెంట్ రోడ్డు, డ్రైనేజీ కాలువ ఉన్న వీధి ఒక్కటి లేదు. చంద్రగిరి  శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2 దఫాలుగా ఇక్కడ అధికారంలో ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా దామలచెరువు లోని ప్రతి వీధిలో సిమెంట్ రోడ్డు నిర్మిస్తాం అని మాటిచ్చారు కానీ చేసింది లేదు. డ్రైనేజీ కాలువలు లేవు కానీ, డ్రైనేజీ పన్నులు మాత్రం వేస్తారని జనసేన నాయకులు నాసిర్ అహ్మద్ అన్నారు. ఉన్న కాలువలు అన్న శుభ్రంగా ఉన్నాయా అంటే అవి లేవు దీని వలన పసిపిల్లలు అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓట్ల సమయంలో ఉండే శ్రద్ధ ప్రజల పైన, ప్రజా సమస్యల పైన అధికారం వచ్చాక మీకు ఎంధుకుండదని ప్రశ్నించారు. ఇంటి నుండి వచ్చే వ్యర్థము ఇంటి వెనుక గుంతలు తీసుకుని నిల్వ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. దామలచెరువులోని ప్రతి వీధిలో రోడ్డులు నిర్మించాలి. డ్రైనేజీ కాలువలు వెయ్యాలి. ఉన్న కాలువలు క్రమం తప్పకుండ శుభ్రపరచాలని జనసేన పార్టీ తరపున కోరుకుంటున్నామని నాసిర్ అహ్మద్ అన్నారు. అతి తొందరలో దీని పైన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way