Search
Close this search box.
Search
Close this search box.

వారాహి యాత్రలో వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టిస్తే సహించేది లేదు

వారాహి

     ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ రేపు కృష్ణాజిల్లా పెడనలో వారహి యాత్రకు వైసీపీ నాయకులు ఆటంకం కల్పించి అల్లర్లు సృష్టిస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని అన్నారు. అలా ఏమైనా జరిగితే దానికి జగన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా జాగ్రత్తగా ఉండలని అమలాపురంలో మాదిరిగా వైసీపీ వాళ్ళు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, అలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పులివెందుల మాదిరి మార్చాలని చూస్తున్నాడని అన్నారు. అలాగే 2024 లో వచ్చేది జనసేన, టిడిపి ప్రభుత్వమేనని వైసీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way