వరద బాధితులకు సహాయం అందిస్తున్న జనసేన నాయకులపై వైసీపీ నాయకుల దౌర్జన్యాలు మానుకోవాలి

      పుట్టపర్తి, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో అధిక వర్షాల కారణంగా పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల జనసేనపార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం పట్టణంలో వరదలు ముంచితే చాలా ప్రాంతాలు నీటిమయం అవడం జరిగింది. ఈ కారణంగా గత మూడు రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆహార పదార్థాలు, నిత్యవసర సరుకులు, పండ్లు జనసేనపార్టీ తరపున మా జిల్లా అధ్యక్షులు TC వరుణ్, రాష్ట్ర కార్యనిర్వహక ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి, జిల్లా నాయకులు అందరూ ప్రజలకు అందజేస్తున్నారు. స్థానిక వైసీపీ నాయకులు ప్రజలకి ఈ ఇబ్బంది పరిస్థితులలో ఎటువంటి సాయం చేయకపోగా, ప్రజలకు అండగా నిలబడుతున్న మా జనసేన పార్టీ నాయకులకు ప్రజలలో మంచి పేరు రాకూడదని అదే పనిగా ప్రజలకు సాయం అందకుండా అడ్డుపడడం అమానుషం. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజల ఓట్లతో గెలిచిన మీరు అండగా ఉండవలసింది పోయి వారికి అందే సాయాన్ని కూడా అందకుండా చేయడం దుర్మార్గం. మీకు ప్రజలు తప్పకుండా తగిన బుద్ధి చెబుతారని మేము జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తున్నాము అని తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పూల వెంకటేష్, పసుపులేటి సూర్యనారాయణ, D.నరేంద్ర భూపతి, పూల రెడ్డప్ప గూడా మధు, ముత్తా నరేంద్ర, సమ్మిటి నవీన్, సాకే తేజ ప్రదీప్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way