Search
Close this search box.
Search
Close this search box.

గ్రావెల్ అక్రమ రవాణా అడ్డుకున్నందుకు వైసీపీ నాయకుల ఆరాచకం

గ్రావెల్

    నెల్లూరు ( జనస్వరం ) : కోవూరు నియోజకవర్గం కొడవలూరు గ్రామం దత్తం లో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను స్థానికులు నిన్న రాత్రి అడ్డుకున్నారు వైసిపి నాయకులు నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ స్థానిక గిరిజనులపై దాడి కి యత్నించారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్థానిక పోలీసులు ఇద్దరినీ సమన్వయపరిచారు. ఈ రోజున కొడవలూరు పోలీస్ స్టేషన్లో గ్రామస్తులందరూ కలిసి గ్రావెల్ అక్రమ రవాణా పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మొన్న మీరు వచ్చి జనసేన పార్టీ తరఫున గ్రావెల్ తవ్వకాలను ప్రశ్నించటం చూసి ధైర్యంగా నిన్న రాత్రి గ్రావెల్ రవాణాను నిలిపాము. ఆడోళ్ళతో కూడా పచ్చి బూతులు మాట్లాడుతూ యానాదులు మీకెందుకురా ఈ గొడవలు అని తిట్టిపోశారు. మేము చల్లా యానాదులమే మమ్మల్ని చంపి మా శవాల మీద ఈ గ్రావాల్ తీసుకొని పొండి అని మేము మొండిగా నిలబడ్డాము. ప్రాణం పోయినా ఇక్కడి నుంచి లారీ పోనివ్వము.. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాము వైసిపి నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారు. మా ఇల్లు ఖాళీ చేపిస్తామని బెదిరిస్తున్నారు న్యాయపరంగా పార్టీ తరఫున మీరు అండగా నిలబడాలి అని జనసేన నాయకులు గునుకుల కిషోర్,సుధీర్ బద్దెపూడిని కోరారు. జనసేన పార్టీ తరఫున అండగా నిలబడతామని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని న్యాయపరంగా గిరిజనులకు అండగా ఉండి జరగతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తామని జనసేన నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way