వైసీపీ నాయకులకు దోచేందుకు కాదేది అనర్హం

వైసీపీ

     నెల్లూరు ( జనస్వరం ) : నది పక్కన పోరంబోకు స్థలంలో మట్టి యదేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. రోజుకు 50 నుంచి 60 ట్రాక్టర్లు తవ్వుకుంటున్నారంటూ జనసేన పార్టీ జిల్లా గునుకుల కిషోర్ నిరసన గళం వినిపించారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి మండల నాయకులు ఎవరికి చెప్తారో చెప్పుకోండి లైన్ క్లియర్ చేసుకున్నాను. ఎవరికి చేరాల్సినవి వారికి చేరుతున్నాయి నన్ను ఆపేది ఎవడో చూసుకుంటాను అంటూ వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా తవ్వి ఉదయం యంత్రాలు,ట్రాక్టర్లు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోయినసారి వచ్చిన వరదలకు చుట్ట పక్కల గ్రామాలు మొత్తం మునిగిపోయింది. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న గారు ఇక నేను పోటీ చేయట్లేదు కదా నాకెందుకులే అని ఇంట్లో కూర్చున్నట్లు ఉన్నారు.  ఈ ఆరు నెలలు కూడా మీరే ఎమ్మెల్యే నీ ఈ దోపిడీని ఆపాల్సిన అవసరం ఉంది. వీరికి సమాజం పట్ల బాధ్యత లేదు,అధికారులు అంటే భయం లేదు,చట్టాలంటే గౌరవం లేదు,ఇష్టారీతిన వ్యవహరిస్తున్న ఈ వైసీపీ నాయకులకి రానున్న ఆరు నెలల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. సహజ సిద్ధంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఏర్పడిన వనరులను దోచుకు తింటున్న వైసిపి నాయకులను ఇంటికి పంపించాలి. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగునుకుల కిషోర్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, షాజహాన్, శీను, వర్షన్, కార్తీక్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way