గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసీపీ గూండాల దాడి అప్రజాస్వామికం – జనసేన పార్టీ ఏలూరు ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు

     ఏలూరు, (జనస్వరం) : కృష్ణాజిల్లా గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసీపీ గూండాల దాడి అప్రజాస్వామికమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఖండించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నారా? లేక గుండాల పరిపాలనలో ఉన్నారా?గన్నవరం టిడిపి కార్యాలయంపై, వైసిపి గుండాల దాడి ప్రస్ఫుటం చేస్తోందన్నారు. పార్టీ కార్యాలయం అంటే, దేవాలయం లాంటిదని ఒక అసెంబ్లీ, ఓ పార్లమెంట్ భవనం లాంటిదని, ఇటువంటి పార్టీ కార్యాలయాలపై దాడులకు ఎగబడి, కార్యాలయాలను, అక్కడున్న వాహనాలను తగులబెట్టి, పార్టీ కార్య కర్తలపై దాడులకు ఎగబడి,ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారు అన్నారు. మాకే ఓటేయాలి, మా పార్టీ జెండాని పట్టుకోవాలని, రాష్ట్రంలో ఉన్న పౌరులను భయకంపితులను చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి, న్యాయ వ్యవస్థను లెక్కచేయకుండా, నేను చేసిందే చట్టం, నేను రాసిన రాజ్యాంగమే అమలు కావాలి అని, పోలీసు వ్యవస్థను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని, ఇష్టరీతిగా దాడులు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకు వెళుతున్నాడని ప్రజలు గమనిస్తున్నారన్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని రాష్ట్ర డిజిపి పరిశీలించి గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడికి గుండాలను ప్రోత్సహించిన వైసీపీ నాయకుల పైన, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way