Search
Close this search box.
Search
Close this search box.

మంగళగిరిలో మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీలోకి మహిళలు చేరిక

               అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మహిళలు భారీ స్థాయిలో జనసేన పార్టీలో చేరారు. తదనంతరం మహిళలను ఉద్దేశించి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ప్రసంగించారు. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహిళల కోసం జనసేన పార్టీ లో ఝాన్సీ లక్ష్మి భాయి వీరనారిగా పోలుస్తూ ప్రత్యేక స్థానం ఇచ్చారని అన్నారు.  మహిళలు వారి ఆలోచనలు, వారి భావాలను పంచుకోవడం జరిగింది. మహిళలను వెన్నుండి ప్రోస్తహిస్తే వారు సాధించలేని విజయాలు ఏవి వుండవని తెలియజేశారు. ఈ సృష్టికర్థ అయినటువంటి మాతృ మూర్తిని గౌరవించేలా సమాజంలో వ్యక్తుల దోరణి లో మారాలని తెలియజేశారు.  మహిళలందరూ జనసేనపార్టీ  బలొపేతానికి కృషిచేయాలని, అలాగే పార్టీలో మహిళలకు తగు గౌరవం, సముచిత ప్రాధాన్యత లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way