
విజయనగరం ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన సంఘటన రేపల్లెలో ఒక నిండు గర్భిణీపై ఒక గ్యాంగ్ రేప్ చెయ్యడం జరిగింది. ఆ దారుణం మరువక ముందు విజయనగరం జిల్లాలో మరో సంఘటన జరిగిందన్నారు. ఉడా కాలనీలో ఉంటున్న ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను చదివించుకోవడానికి ఒక టీ దుకాణంలో పని చేసుకుంటుంది. కొంతమంది రాత్రి 11 సమయంలో కొందరు ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం వైఫల్యమే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు ఇలా అందరూ కూడా దిశ చట్టం గురించి చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నారు. దిశ చట్టం ఉంటే దిశ చట్టం పని చేస్తే ఇలాంటివి జరగవు. ఈ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ ఇవ్వడం లేదు అని పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గ వీరఘట్టం మండల జనసేన నాయుకులు వజ్రగడ. రవికుమార్(జానీ) పుండరికం డిమాండ్ చేస్తున్నారు.