మహిళా సాధికారత జనసేన టీడీపీ పార్టీలతోనే సాధ్యం

    అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 7వ డివిజన్ నీరుగంటి వీధిలో పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన టీడీపీ పార్టీలకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగాభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని వారి ఆర్థిక ఎదుగుదలకు ఏమాత్రం కృషి చేయకుండా రాష్ట్ర స్థూల ఆదాయంలో మహిళల వాటా ఏమాత్రం లేకుండా చేసారని అన్నారు. దీనికి తోడు డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి వారి సాధికారతను దెబ్బతీసాడని జగనన్న పాలవెల్లువ వల్ల మహిళలకు ఓరిగింది ఏమి లేదని కనుక మహిళలంతా ఈ విశయాలన్ని గ్రహించాలని కోరారు. జనసేన టీడీపీ పార్టీలతోనే మహిళలకు సముచితమైన సాధికారత లభిస్తుందని వారి ఆర్థిక ఆత్మగౌరవం పెంపొందించేందుకు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటారని అన్నారు. వీటితో పాటు స్థానిక డివిజన్ లో పందుల స్వైర విహారం చేస్తున్నాయని, గడిచిన నేల నుంచి మంచినీరు ఏమాత్రం రావడం లేదని అయినప్పటికీ స్థానిక వైకాపా కార్పొరేటర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way