Search
Close this search box.
Search
Close this search box.

గిరిజనుల రిజర్వేషన్ లకు తూట్లు పొడుస్తారా? అరకు జనసేన నాయకులు

       అరకు, (జనస్వరం) : రాజకీయల్లో డబ్బు పరంగా, సామాజికంగా అన్నీ విధాలుగా అభివృద్ధి చెందిన బీసీ -బోయ వాల్మీకి, బెంతు, ఒరియాలను ఎస్టీల్లో చేర్చడానికి సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం ఏక సభ్య శామ్యూల్ ఆనంద్ కమిషన్ ఏర్పాటు చేయడాన్ని జనసేనపార్టీ నాయకులు మాదాల శ్రీరాములు, జనసేన నాయకులు సాయిబాబా దూరియా తప్పు పట్టారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే గిరిజనులు అభివృద్ధిలో ఇతర వర్గాల కన్నా వెనకబడి ఉన్నారని నీళ్లు, రోడ్లు, ఇల్లు లేని అనేక గ్రామాలతో అభివృద్ధికి దూరంగా ఉన్నారని అన్నారు. రిజర్వేషన్ ఫలాలు పొందలేక పోయారని, అభివృద్ధిలో ముందడుగులో ఉన్న బోయ, బెంతో, ఒరియాలు ఉన్నారని గిరిజన 33 తెగలు, 28 లక్షల మంది ఉంటే, బోయ, బెంతో, ఒరియలు కలిపి 60లక్షలు ఉన్నారని, వీరితో నిజమైన గిరిజనుల భవిష్యత్ మనుగడ ప్రశ్నర్ధకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 52 జీవో, శామ్యూల్ ఆనంద్ కమిటీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన పాడేరు, అరకు ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, పాల్గుణలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, 52 జీవో పై వైఖరి తెలియజేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way