Logo
Date of Publish : 28 May 2021, 4:22 pm
Editor : Sake Naresh

సోమశిల ప్రాజెక్టును గాలికి వదిలేస్తారా ? మరమ్మత్తుల సంగతి ఏంటి ? : జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

            నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, అనంతసాగరం మండల అధ్యక్షుడు మహబూబ్ మస్తాన్ తో కలసి సోమశిల జలాశయం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోమశిల జలాశయం, నెల్లూరు జిల్లా ప్రజల పాలిట ఆధునిక దేవాలయం అని అన్నారు. సోమశిల,కండలేరు జలాశయాలు, నెల్లూరు, సంగం బ్యారేజ్ లు మరియు కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లు మొత్తం కలసి, మన జిల్లాలో షుమారు 180 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కారణభూతమైన జిల్లా వరప్రదాయని, ఈ సోమశిల జలాశయం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ జలాశయం, గత ఏడాది నవంబర్ నెలలో వచ్చిన వరదల కారణంగా, జలాశయం ముందు భారీగా దెబ్బతిని 20 నుండి 30 అడుగుల లోతు గొయ్యలు పడిన విషయము మనకందరికీ తెలిసినదే. డ్యామ్ సేఫ్టీ కమిటీ ఈ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇవ్వటం కూడా జరిగింది. ఈ పనులను అత్యవసర పనులుగా భావించి మరమ్మత్తులు చేయని పక్షంలో, జలాశయానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. మన రాష్ట్రం లోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలలో సాగు తాగు నీటి అవసరాలు మాత్రమే కాకుండా, పక్క రాష్ట్రమైన తమిళనాడు తాగునీటి అవసరాలను తీరుస్తున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు ఇది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టు దెబ్బతిని సుమారు ఏడు నెలలు గడుస్తున్నా ఎటువంటి మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం, ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరియు రైతాంగం పట్ల వారికున్న చిత్తశుద్ధి కూడా ఈ విషయంలో తేటతెల్లమౌతుంది. గత వారంలో సోమశిల కు కొద్దిపాటి వరద ప్రవాహం మొదలైంది. సోమశిల జలాశయానికి పూర్తిస్థాయిలో వరదలు రావడానికి కేవలం మూడు నాలుగు నెలల కాలం మాత్రమే ఉంది. ఇప్పటికైనా సోమశిల డ్యామ్ లోని దెబ్బతిన్న ప్రాంతానికి మరమ్మతులు చేయని పక్షంలో, అటు సోమశిల జలాశయం ఇటు పెన్నా పరివాహక ప్రాంతం లోని నెల్లూరు నగరంతో సహా పలు గ్రామాలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి వెంటనే నిధులను కేటాయించి మరమ్మతులను పూర్తిచేయాలని, జిల్లా రైతాంగానికి ఆయువుపట్టు లాంటి ఈ ప్రాజెక్టును కాపాడాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.

 

ఇవి కూడా చదవండి :

కరోనా బాధితులతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రులు : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్

 

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com