భూ సర్వేలో జరుగుతున్న అవకతవకలను సరి చేస్తారా లేదంటే సర్వే ఆపేస్తారా

    సర్వేపల్లి ( జనస్వరం ) : మనుబోలు మండలంలో జగనన్న భూ సర్వేలో వైసిపి నాయకుల చేతివాటంపై బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో జగనన్న భూ సర్వేలో వైసిపి నాయకులు చేతివాటం కొనసాగుతుంది. అనడానికి నిదర్శనం ఏదైతే మనుబోలు మండలంలో కుడితిపల్లి నందు సర్వేనెంబర్ మూడులో 11 ఎకరాల భూమి శాస్త్రిక భూమి. ఈ భూమికి తూర్పు పొదలకూరు రోడ్డు, దక్షిణం సిజెఏ ప్లాన్స్, పడమర చెరువు, ఉత్తరం చెరువు మరియు స్మశానం కలిగి ఉన్నాయి. అయితే శంకర్ రెడ్డి అనే ఆయన హస్త గతంలో ఈ 11 ఎకరాల భూమిని పెట్టుకొని ఎనిమిది మందికి అగ్రిమెంట్ల రూపంలో అమ్మకం చేయడం జరిగింది. అయితే ఈనెల 14వ తారీకు భూ సర్వేలో భాగంగా ఆ భూమిని కొనుగోలు చేసి మూడు సంవత్సరాల నుంచి సాగుబడి చేసుకుంటున్నటువంటి కంటే సుధాకర్ కు ముందు రత్నమ్మ వీళ్ళు ఇరువురు కూడా సర్వే దగ్గరికి వెళ్లి నిలబడి ఉంటే ఏదైతే చెందిన గుండుబోయిన ప్రసాద్ వైసీపీ నాయకుడు ఆ భూమి నాది అని చెప్పి వాగ్వాదానికి వివాదానికి దిగడం జరిగింది. దీనికి ప్రధాన కారణం కంటే సుధాకర్ గారు అడిగే వివరణ ఒక్కటే భూ సర్వే చేసేటప్పుడు ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది. ఎవరు సాగుబడి చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్న తర్వాతే మీరు పట్టాలు మంజూరు చేయాలి. కానీ అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా మీ వైసీపీ నాయకులకి పంచుకుంటాం అంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు మేము ఒకటే కోరుతున్నాం. మీ నాయకులు, మీ కార్యకర్తలు ఇంతటి అరాచకాలకు పాల్పడుతూ అర్హులైన భూమి మాది అని వినియోగంలో ఉన్న వాళ్ళ నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా జరిగితే జనసేన పార్టీ ఊరుకోదు. మీకు కాలం 60 రోజులే గుర్తుపెట్టుకోండి. ఇకనైనా కళ్ళు తెరిచి భూ సర్వేలో జరుగుతున్న అవకతవకలను సరి చేస్తారా లేదంటే భూ సర్వే ఆపేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వీర మహిళ గుమ్మినేని వాణి భవాని వెంకటాచలం మండల సమన్వయకర్త శ్రీహరి, స్థానికులు కంటే సుధాకర్ సుబ్రహ్మణ్యం, బింకిన సుగుణమ్మ, కంటే శ్రీనివాసులు, దామ వెంకటేశ్వర్లు, కంటే శారద, కంటే కావ్య, బింకేన శ్రీనివాసులు, కంటే లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way