జర్నలిస్టులకు పూర్తి సహకారాన్ని అందజేస్తా : కందుల నాగరాజు

      విశాఖపట్నం ( జనస్వరం ) :జర్నలిస్టులు తన కుటుంబ సభ్యులు వంటి వారని వారికి ఏ సమస్య వచ్చినా తాను ముందు ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు.కొంతకాలంగా ఎవస్యులర్ నెక్రాసిస్ (ఆర్థో) వ్యాధితోబాధపడుతున్న వి టెలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ నడిపిల్లిమోహన్ కృష్ణకు వైద్య ఖర్చులనిమిత్తం ఐదు వేల రూపాయలను ఆయన అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూవి టెలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ నడిపిల్లిమోహన్ కృష్ణకు వైద్య ఖర్చుల నిమిత్తం సహ జర్నలిస్టులు తనకు సమాచారం ఇచ్చిన వెంటనే తాను వెంటనే స్పందించి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించినట్లు చెప్పారు.ఇచ్చిన హామీ మేరకు తనువుంటే సహాయంగా తన ప్రకటించిన నగదు మొత్తాన్ని అందజేయడం జరిగిందని తెలిపారు.నిత్యం పని ఒత్తిడితో పనిచేసే జర్నలిస్టులు పలువురు అనారోగ్యాల పాలవుతున్నారని అన్నారు. ఏదైనాప్పటికీ ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని సూచించారు.మోహనకృష్ణ కు పూర్తి వైద్య ఖర్చుల కయ్యే నగదు నిమిత్తం సహ జర్నలిస్టులు చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు.ఈ కార్యక్రమంలోవి టెలి న్యూస్ ఛానల్ రిపోర్టర్ నడిపిల్లిమోహన్ కృష్ణ,సీనియర్ జర్నలిస్టులు ఈరోతి ఈశ్వరరావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్,మహేష్, దిలీప్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way