Search
Close this search box.
Search
Close this search box.

మద్యపాన నిషేధం ఇంకెప్పుడు చేస్తారు జగన్ రెడ్డి ? : దారం అనిత

మద్యపాన నిషేధం

          మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి పార్టీ మానిఫెస్టోలో మద్యం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని, మద్యాన్ని దశల వారీగా నిషేదిద్దామని నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తరువాత అదే పెద్ద ఆదాయ వనరుగా చూస్తున్నారు. అధికార పార్టీ ప్రజల ప్రాణాలు ఏమైపోయినా పర్లేదు గానీ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం వచ్చి తీరాలి అని అనుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంటే నియంత్రించాల్సిన ప్రభుత్వం మద్యం అమ్మకాలు పెంచి ఆ ఆదాయం మీద అప్పులు తేవాలని చూడడం బాధాకరం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ఏపీ బెవరేజ్స్ కార్పొరేషన్ ఆదాయం చూపించి రూ.8,300 కోట్ల అప్పులు తీసుకొని వచ్చింది. ఇప్పుడు మద్యం మీద పెరిగిన ఆదాయాన్ని చూపించి రూ.25 వేల కోట్ల అప్పులు తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. ప్రజల ఆరోగ్యం కంటే కూడా ఆదాయం ముఖ్యం అనుకోవడం ఖచ్చితంగా పౌర సమాజం ఖండించాల్సిన అంశం అని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way