బట్రేపల్లి జలపాతాన్ని అభివృద్ధి చేసేదెప్పుడు? జనసేన నాయకులు కూటాల లక్ష్మణ్

      కదిరి ( జనస్వరం ) : బట్రెపల్లి జలపాతాన్ని, దేవర చెరువు కట్టను పర్యాటక ప్రదేశాలుగా తీర్చి దిద్దుతాము అని కదిరి నియోజక వర్గం శాసన సభ్యులు వెంకట సిద్దారెడ్డి ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలు కాలం గడుస్తున్నా ఎక్కడా ఆచరణకు నోచుకోలేదని జనసేన నాయకులు కూటాల లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ది పేరుతో దేవర చెరువు కట్ట మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను నరికేశారు. ఇప్పటి వరకూ అక్కడ పార్క్ ఏర్పాటు కోసం ఒక్కటి ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదు. స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు హమీలుగానే ఉన్నాయి తప్ప ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. బట్రెపల్లి ప్రాంతాన్ని గతంలో ఎమ్మెల్యే సందర్శించి బట్రెపల్లి ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం అని ప్రకటన కూడా చేశారు. ఇప్పటి వరకు ఆ వైపుగా చర్యలకు ఉపక్రమించలేదు. అయ్యా ఎమ్మెల్యే కదిరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లేదంటే ప్రజల ఆగ్రహానికి గురవ్వక తప్పదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way