భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు మళ్లించేందుకు ప్రభుత్వానికి ఏ అధికారం ఉంది.. జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు మళ్లించేందుకు ప్రభుత్వానికి ఏ అధికారం ఉంది.. జనసేన పార్టీ ఈమని కిషోర్ కుమార్                  

                 జగ్గయ్యపేట నియోజకవర్గం పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులకు సంబంధించి ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తుంది అని, మాకు సంబంధించిన నిధులని ప్రభుత్వం పక్క దారి మళ్ళిస్తుంది అని నియోజకవర్గ అధ్యక్షులు నీలకంఠం ప్రసాద్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఈమని కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారుగా 2000 మందికి పైగా రిజిస్టర్డ్ భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారికి సంబంధించిన నిధులని ప్రభుత్వం ప్రక్కదారి పట్టిస్తోంది అని, మొదట ఇసుక  కొరత, ఆ తరువాత కోవిడ్ 19 వచ్చాయి అని,  ఫలితంగా ఉపాధి కరువైంది అని ఇలాంటి పరిస్థితిలో నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కిన సాయం శూన్యం అని, భవన నిర్మాణ కార్మికుల బాగోగులని చేసుకోవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా భవన నిర్మాణ కార్మికులకి సంబంధించిన 450 కోట్ల సంక్షేమ నిధులని రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది అని ఆయన తెలిపారు. ఇలా చేయటం రాజ్యాంగ విరుద్ధం అవుతుంది అని, కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారని, వెంటనే వీరికి సంబంధించిన నిధులని వారి ఖాతాల్లో జమ చేయకుంటే ఏ ఐ టి యు సి వారితో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి ఉదృతం చేస్తాం అని ఆయన తెలిపారు.