జనసేన పార్టీని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేస్తాం శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు
పెనుకొండ నియోజకవర్గం నుండి 100 కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీ నుంచి సాధారణంగా ఆహ్వానించినటువంటి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు జనసేన పార్టీ (PAC) సభ్యులు, మరియు ఆకుల ఉమేష్ రాయలసీమ సమన్వయకర్త, పెనుకొండ నియోజకవర్గం నాయకులు కుమార్ గోరంట్ల మండలం నాయకులు సురేష్, వెంకటేష్ సోమందేపల్లి మండల నాయకులు మహేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పెద్దలు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ లోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియచేస్తూ కార్యకర్తలు కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్టీలోకి వచ్చి చేరిన ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి అండగా ఉండి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిని చేయడమే ద్వేయంగా అని అన్నారు, అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా గా పనిచేసి జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దాం అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి కార్యకర్త కు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో పెనుగొండ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.