Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీతోనే ఉంటాం – వెంపల్లి గౌరీ శంకర్

వెంపల్లి గౌరీ శంకర్

        విజయవాడ, (జనస్వరం) : స్థానిక 47వ డివిజన్ లో వెంపల్లి గౌరీ శంకర్ గారి ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీకి జనాధారణ లభిస్తుందని, అందుకోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. వెంపల్లి గౌరీ శంకర్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీతోనే ఉంటామన్నారు. పార్టీ అభివృద్ధి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అనంతరం 50 కేజీల కేకును కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గుండు జితేంద్ర, జిల్లెల్ల అనిల్, కనకరావు, రాళ్లపూడి గోవింద్, దివాకర్, శంకర్, విజయకుమారి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way