పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలుస్తాం : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

       నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 165వ రోజున 48వ డివిజన్ ఆనం వెంకటరెడ్డి కాలనీ ప్రాంతంలో నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వారు తమ దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్న తమ జీతాలను కూడా వైసీపీ ప్రభుత్వం సరైన సమయానికి వేయట్లేదని, దీంతో ప్రతి నెలా నెలసరి వాయిదాల సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఒప్పంద కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, ప్రభుత్వం కనీస వేతనాల అంశంలో జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని, ఆ జీవోలు అమలు కావట్లేదని పలువురు కేతంరెడ్డి వద్ద వాపోయారు. రానున్నది పవనన్న ప్రభుత్వమే అని, తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్మికునికి అండగా నిలుస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way