Search
Close this search box.
Search
Close this search box.

ముస్లింలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : ముస్లిం జనసేన నాయకులు

జనసేన

         గుంటూరు ( జనస్వరం ) : కుల, మత రహిత రాజకీయాలే జనసేన సిద్దాంతం అని ముస్లిం జనసేన నాయకులు అన్నారు.  ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చకుండా ముస్లింలను నిలువెల్లా దగా చేసిన జగన్ సర్కార్ అని వాపోయారు. ముస్లిం మైనారిటీల , భద్రతకు , సంక్షేమం కోసం ఎలాంటి త్యాగాలకైనా జనసేన సిద్ధమన్నారు. ముస్లింల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారన్నారు. 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో రూపొందించిన పవన్ భయ్యా మీతోనే మేము
పవన్ భయ్యా మీతోనే మా ప్రయాణం పోస్టర్లను జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నగర కార్యదర్శిలు మెహబూబ్ బాషా, బండారు రవీంద్ర, ఏడవ డివిజన్ అధ్యక్షుడు రజాక్, సయ్యద్ రఫీ, మొహమ్మద్ యూసఫ్, షేక్ నాగూర్, మదార్, నాగూర్ బాబు, రామిశెట్టి శ్రీనివాసరావు, శెట్టి శ్రీను, రాష్ట్ర రెల్లి నాయకుడు సోమి ఉదయ్, బల్లాల హేమంత్, బద్రిశెట్టి కుమారస్వామి, భలే ప్రభాకరరావు, అలా గోవింద్, నండూరి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way