Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కల్యాణ్ ను సీఎం చేస్తాం

“ఇంటింటా జనసేన”లో లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి
అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో అర్బన్ నియోజకవర్గంలోని రాజీవ్ కాలనీ పంచాయితీ నందు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తామని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, రాప్తాడు ఇంఛార్జి సాకే పవన్ కుమార్, అనంతపురం నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి నాగేంద్ర, జిల్లా కార్యదర్శి సంజీవ రాయుడు, చంద్ర, జక్కరెడ్డి ఆది నారాయణ, ఇండ్ల కిరణ్, జయమ్మ, ఇమామ్ హుస్సేన్, మేదర్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు రోళ్ళ భాస్కర్, కమటం వెంకటనారాయణ, ఆకుల ప్రసాద్, విశ్వనాథ్, సంపత్, పాలగిరి చరణ్ తేజ, వియకుమార్, భవాని నగర్ మంజునాథ్, భవాని నగర్ సాయినాథ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way