భవిష్యత్తు బాగుండాలని తీసుకున్న పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తాం

     సూళ్లూరుపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానుసారం సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ గారు తెలుగుదేశం పార్టీకి తన మద్దతు తెలియజేశారు. టిడిపి ఇంఛార్జి మాజీ పార్లమెంట్ సభ్యులు నెలవల సుబ్రమణ్యం గారిని నాయుడుపేటలోని వారి నివాసంలో DV సత్రం మండల ఉపాధ్యక్షుడు యల్లంపాటి రిషి, తడ మండల ఉపాధ్యక్షులు సిరివేటి రమణ మరియు నాగరాజ్, ప్రధాన కార్యదర్శులు చేని ముని శేఖర్, మురళి కృష్ణ రెడ్డి, నెలబల్లి ఆనంద్, మణి, కాశి, అజిత్, బాలు, ప్రతాప్, నాగార్జున మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన జనసైనికులు కలిసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని తీసుకున్న నిర్ణయం ప్రకారం టిడిపి కార్యకర్తలకు, నాయకులకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు. ఈ వైసీపీ నియంత పాలన, అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలంటే అందరూ కలిసి కట్టుగా రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో విజయం సాధించడానికి కృషి చేస్తామని తెలియజేశారు. టిడిపి వారు కూడా జనసైనికులకు అండగా నిలవాలని సోమశేఖర్ కోరారు. కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మంచి నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నారని జనసైనికులతో నెలవల హర్షం వ్యక్తం చేశారు. అలాగే మద్దతు తెలియజేసిన జనసైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way