Search
Close this search box.
Search
Close this search box.

రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా మిత్రులపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

   అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేనొక నియంతని నేను చెప్పిన విధంగా మీరందరూ నడుచుకోవాలి, లేదని ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే మీడియా మిత్రులపై ప్రభుత్వ అధికారులను ఉసిగొలిపి తప్పుడు కేసులు పెట్టిస్తాను.  వినకపోతే వైసిపి నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టి ఉన్మాదులుగా తయారుచేసి దాడులు చేయిస్తాను అని అధికార మదమెక్కి ప్రవర్తిస్తున్న తీరుని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు “జర్నలిజం” అన్న, “జర్నలిస్ట్” అన్న నీకేం తెలుసు? ఒక సంస్థకు యజమాని అయి ఉండి కూడా జర్నలిస్టు హక్కులను కాలరాస్తూ వారి పైన దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నావు, ఈ పాపం ఊరికే పోదు భవిష్యత్తులో తలిగిన మూల్యం చెల్లించుకో తప్పదు అని నీకు తెలియజేస్తున్నాం అన్నారు. జర్నలిజాన్ని తమ వృత్తిగా చేసుకొని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని తమ యజమాన్యాలు చాలిచాలని జీతాలని ఇచ్చిన, అర్ధాకలతో కడుపు మాడ్చుకొని ఎండనకా! వాననకా!! గాలనక!!! అలుపెరగకుండా వాస్తవాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చేరువేయాలని దృడ సంకల్పంతో నీతి నిజాయితీతో ఎందరో మహానుభావులు ప్రాణాలను లెక్కచేయకుండా ప్రాణత్యాగం చేసిన జర్నలిస్ట్ మహానుభావులు ఉన్న దేశం ఇది. నీలాంటి నియంతలు ఎందరో కాలగర్భంలో కలిసిపోయినారు నీవెంత? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని జనరల్ లిస్టు సోదరులకు, జర్నలిస్టు సమాజానికి బేసరత్తుగా క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఆ  పత్రిక జర్నలిస్టుపై దాడి జరిగింది మాకెందుకులే! మా పత్రిక జర్నలిస్టు పైన కాదు కదా! అని జర్నలిస్టు సోదరులు ఎవరు భావించకండి, ఈరోజు వారికి జరిగింది రేపు మీకు జరగదని గ్యారెంటీ ఏమిటి? జర్నలిస్టు సోదరులు అందరూ సంఘటితంగా ఏకం తాటిపై కొచ్చి జర్నలిస్టు సమాజాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో “చలో అనంతపురం” అనే కార్యక్రమంలో జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారు పాల్గొని జర్నలిస్టు సోదరులకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష మరియు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way