Search
Close this search box.
Search
Close this search box.

జనసేనపార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి : దుర్గాడ గ్రామ జనసైనికులు

జనసేనపార్టీ

               తూర్పు గోదావరి ( జనస్వరం ) : గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామంలో ప్రఖ్యాత గాంచిన శివాలయాన్ని జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు జనసైనికులుతో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శివాలయం నందలి శివునికి అభిషేకములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదములు స్వీకరించి అదే గ్రామంలో స్వయంగా వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కడారి నాయుడు మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పదవి లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఒక అవకాశం ఇస్తే ఇంకెన్నో మంచి పనులు చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులు పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో ప్రజలకు చేరువయ్యేలా ప్రతి జనసైనికుడు బాధ్యత తీసుకోని పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way