Logo
Date of Publish : 28 March 2022, 5:18 pm
Editor : Sake Naresh

సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందించిన విశాఖ పశ్చిమ జనసేన నాయకులు

       విశాఖపట్నం, (జనస్వరం) : HPCL ఎక్స్టెన్షన్ లో భాగంగా పెద్ద పెద్ద పరికరాలు కంపెనీలోకి రావాల్సి ఉందని దాని వలన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ నుంచి మల్కాపురం మెయిన్ రోడ్ మీద ఉన్న డివైడర్ నీ తొలగిస్తున్నారు. డివైడర్ తొలగించిన తరువాత ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికంగా ఉంది. కాబట్టి డివైడర్ ను తొలగించుటకు మేము ప్రజల ప్రాణాల దృష్ట్యా వ్యతిరేకిస్తున్నాము. కానీ డివైడర్ తొలగించే పరిస్థితి తప్పనిసరి కాబట్టి పారిశ్రామిక ప్రజలకు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని జనసేన పార్టీ తరపున బలంగా డిమాండ్ చేస్తున్నాము. అవి ఏమనగా

1. డివైడర్ ను తొలగించిన వెంటనే తాత్కాలిక డివైడర్ ను ఏర్పాటు చెయ్యాలి. అదే విధంగా రేడియం స్టికర్స్ అమర్చి రాత్రి పూట ప్రమాదాలు జరగకుండా కాపాడాలి. ఈ ప్రాంతంలో ప్రయాణించు వాహనదారులకు ఎలాంటి ప్రమాదాలు జరిగిన దానికి పూర్తి బాధ్యత HPCL కంపెనీ వహించాలి అని జనసేన పార్టీ తరపున బలంగా డిమాండ్ చేస్తున్నాము.

2. డివైడర్ తొలగించిన తరువాత దుమ్ము ధూళి విపరీతంగా పెరుగుతుంది. కావున GVMC నుంచి అధికంగా మాన్ పవర్ ను పెట్టీ ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యాలి. లేని పరిస్థితిలో రోడ్ వారు షాపులు, ఇళ్ళు దారుణంగా తయారవుతాయి.

పై రెండు డిమాండ్ లను లిఖితపూర్వకంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయునచో మేము స్వాగతిస్తాము లేని పక్షంలో మేము నిలువరిస్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com