చిత్తూరు జిల్లాలో 12 మంది మహిళలు, ఆడ పిల్లల మిస్సింగ్ వార్తపై వినూతకోట స్పందన

   శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఉమ్మడి చిత్తూర జిల్లాలో 12 మంది మహిళలు, ఆడ పిల్లలు మిస్సింగ్ అని వచ్చిన వార్తలపై జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంత మంది మహిళలు మిస్స్ అవుతుంటే జిల్లాలో ఉన్న మంత్రి రోజా అస్సలు స్పందించలేదని? కనీసం ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చెయ్యలేదని, కనీసం ప్రెస్స్ మీట్ పెట్టీ సంఘటన గురించి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదని ద్వజమెత్తారు. గన్ను కంటే ముందు జగన్ వస్తాడని ప్రగల్బాలు పలికే ఈ మంత్రి ఎక్కడ నిద్ర పోతుందని వాపోయారు. మహిళా హోమ్ మంత్రి ఎక్కడ ఉన్నారని, ఇప్పుడు మహిళా కమిషన్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కనీసం జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, తిట్టడానికి మాత్రమే వైసీపీలో ఉన్న మహిళ నాయకులు మంత్రులు బయటకి వస్తారని, మహిళలు మిస్స్ అవుతున్న దానిపై ఎందుకు స్పందించరు అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారిని మహిళ మిస్సింగ్ పై ప్రశ్నించిన తిరుపతి ఎస్పీ గారు ఇదే జిల్లా లో ఇంత మంది మహిళల మిస్సింగ్ పై ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. జిల్లాలో మంత్రి గా ఉన్న రోజా కనీసం ఇప్పటికైన కళ్ళు తెరిచి ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టాలని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు బుద్ధి చెప్తారని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way