తాళ్లపూడి మండలంలో గ్రామ గ్రామాన – జనసేన కార్యక్రమం

   తాళ్లపూడి, (జనస్వరం) : గుంటూరు జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామములో జనసేన వార్డ్ మెంబెర్ పోతుల దుర్గాప్రసాద్ ఇంటి వద్ద తాళ్లపూడి మండలం జనసేన మండల అధ్యక్షులు గంటా శివ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ గ్రామానికి జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ గ్రామానికి జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. అలాగే క్రియాశీలక సభ్యత్వం గురించి మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం, 50,000 రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఏది అయినా ప్రమాదంలో మరణించినట్లైతే 5లక్షలు పార్టీ తరుపున ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి జనసేన కార్యకర్త సభ్యత్వంలో భాగస్వాములై సభ్యత్వం ( Or ) రెన్యువల్ చేసుకుని మిగిలిన కార్యకర్తలకు సభ్యత్వం & రెన్యువల్ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇతర పట్టణాల్లో ఉన్నవారు కూడా సభ్యత్వ నమోదు చేయించుకోవలసినగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శీర్ల సూర్యచంద్ర, పిండ్రా గోవింద్, చిన్నరావు, శ్యామ్, నరాలశెట్టి పోసి, గ్రామ పెద్దలు, పెద్దేవం, తాళ్లపూడి, వేగేశ్వరేపురం, మాలకాపల్లి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way