విజయవాడ, (జనస్వరం) : విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు పార్టీ ఆఫీసులో అమ్మిశెట్టి వాసు సూచనల మేరకు, జనసేనపార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత ఆధ్వర్యంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ లను తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 18న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున చెక్కులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని జనసైనికులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత, నగర ఉపాధ్యక్షులు సోమవారం, దోమకొండ మేరీ, పాశం సుజాత, గుంటుపల్లి సుజాత, దోమకొండ అశోక్, పోతిరెడ్డి రమణ, హరి ప్రసాద్, యడ్లపల్లి శివ నాగరాజు, పెద్దిరెడ్డి తిలక్, ఉమామహేశ్వరరావు, అనిల్, బండి ప్రదీప్, పెందుర్తి విజయ్, మోపిదేవి మోహన ప్రసాద్, రమణ సాయి, సాయి మోహన్, నందేపు రవి , జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.