విజయనగరం ఇంచార్జ్ పాలవలస యశస్వి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

                     ఈరోజు విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీమతి పాలవలస యశస్వి గారి ఆధ్యర్యంలో, శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్దాంతాలు నచ్చి ,ఈ రోజు పార్టీ లో చేరడం జరిగింది, 21వ వార్డు, 18వ వార్డు, 32వ వార్డు నుంచి యోగేష్ ద్వార లక్ష్మణ్, ఈశ్వరరావు, కొండేటి కుమారు పలువురు చేరారు. యశస్వి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు చక్రవర్తి , సతీష్, యోగేష్ పాల్గొన్నారు.