విజయనగరం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యములో DR. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి వేడుకలు

విజయనగరం

     విజయనగరం, (జనస్వరం) : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి 65వ వర్ధంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం విజయనగరం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి కాటం అశ్విని మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన ఘనత మహనీయులు అంబేద్కర్ గారు అని, ప్రస్తుతం పాలకులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కులం పునాదుల మీద ఏమి సాధించలేరని, రాజ్యాంగంలో నాడు కల్పించిన పౌర హక్కులు ఎప్పటికైనా ప్రజలకు రక్షణగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువనాయకులు చెల్లూరి ముత్యాలనాయుడు, జడ్డు జనార్ధన్, సాయి కిరణ్, లెంక నాగార్జున, కిలారి వినయ్, లోకేష్, ఎ.శివ గణేష్, రాగోలు సాయి కిరణ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way