తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలో ఉన్న జనసేన కార్యకర్తలతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరియు వాట్సాప్ వీడియో ద్వారా గ్రామాల్లో ఉన్న, మండలాల్లో ఉన్న ప్రజా సమస్యల పైన, కార్యకర్తలతో చర్చించి, గ్రామాల్లో ఉన్న జనసైనికులకు ముఖ్యమైన సూచనలు సలహాలను ఇస్తూ, ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అలాగే నిరంతరము సమస్యల మీద స్పందించాలని, గ్రామాల్లో ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద వెంటనే స్పందించి నివేదిక ఇస్తే, పై అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకూడదు అని, నిరంతరం ప్రజలకు ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వారికి సూచనలు సలహాలు ఇస్తూ, ముఖ్య జన సైనికులకు కార్యకర్తలకు, బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ,, సమస్యల మీద ప్రతి ఒక్కరు స్పందించాలని కోరారు. ప్రతి ఒక్కరికి సమస్య వచ్చినపుడు ప్రశ్నించే మనస్తత్వం ఉండాలని, జనసేన పార్టీ, జన సేనాని ముఖ్య ఉద్దేశమని, ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని, గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, కార్యకర్తలకు బండారు శ్రీనివాస్, పలు సూచనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేశారు.
