నాదెండ్ల మనోహర్ ను కలిసిన వాసగిరి మణికంఠ

    గుంతకల్ ( జనస్వరం ) : జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాద్యుడు వాసగిరి మణికంఠ.  ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి గుంతకల్ నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యల గురించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పరిణామాలపై అలాగే జనసేన టిడిపి ఉమ్మడి కార్యాచరణపై  నాదెండ్ల మనోహర్ గారితో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ బలోపేతం కోసం చేపట్టవలసిన కార్యక్రమాలపై అలాగే నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరూ బలంగా పనిచేయాలని దిశ నిర్దేశాన్ని అందించడం జరిగిందన్నారు.  పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని వారి సేవలకు అనుగుణంగా పార్టీలో వారికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఉంటుందని నాయకుడు ఒక గొప్ప ఆశయం కోసం ముందుకు వెళుతున్న తరుణంలో నాయకులు కార్యకర్తలు అదినాయకుడి వెంట నిస్వార్ధంగా బలంగా నిలబడాలని బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారన్నారు. నాదెండ్ల మనోహర్ గారి సూచనలు, సలహాలతో రెట్టించిన ఉత్సాహంతో మరింత బలంగా పనిచేస్తాం అని వాసగిరి మణికంఠ గారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way