Search
Close this search box.
Search
Close this search box.

ప్లెక్సీ కడుతూ గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సాయం చేసిన వరికూటి నాగరాజు

     దర్శి, (జనస్వరం) : ఇటీవల నూతన సంవత్సరం రోజున కొండేపి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మట్టిపల్లి పూర్ణచంద్ర అనే జనసైనికుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ కడుతూ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కు గురై ఒంగోలులోని వెంకట రమణ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి, దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు పూర్ణచంద్రకి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ చేతుల మీదుగా 15,000/- రూపాయలను అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ జనసైనికులకు ఎప్పుడు ఆపద వచ్చినా జనసేన పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే ఆర్థిక సాయం చేసిన వరికూటి నాగరాజుకి పూర్ణచంద్ర కుటుంబం ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way