వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి వర్ధంతి

      వీరఘట్టం, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ తరుపున వీరఘట్టం మండలం కేంద్రములో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల హక్కుల కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన నాయకుడు, పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా 34 వ వర్ధంతి సందర్భంగా పాలకొండ నియోజక వర్గం వీరఘట్టం మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా చిత్రపటం వద్ద ఘన నివాళులు అర్పించడం జరిగింది. జనసేన జానీ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా గొప్ప పొరాటయోధుడు, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నేటికి ప్రజల హృదయల్లో కొలువున్నారు. రంగా ఆశయ సాధన జరిగేది జనసేన పార్టీతోనేనని అని జనసేన జానీ అన్నారు. మత్స పుండరీకం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహావ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని, కొంతమంది రాజకీయ లబ్ధికోసం రంగా హత్య చేయిoచారు. ఇటువంటి మహనాయకుడిని స్మరించుకోని ఆయన ఆశయానికి అనుగుణంగా మనంకూడా అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వావిలపల్లి నాగభూషన్, కర్ణేన సాయి పవన్, దత్తి. గోపాల్ తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way