పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైకాపా ప్రభుత్వం

   అనంతపురం ( జనస్వరం ) : అర్బన్ నియోజకవర్గం లోని 14వ డివిజన్ లో జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి పలు సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక డివిజన్ లో నివాసముండే జాఫర్ మెహిద్దిన్ సాబిరాబి దంపతులు టిడ్కో గృహాలకై 25వేళ రూపాయలు చెల్లించి ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి దగ్గరకి స్థానిక కార్పొరేటర్ అబుసాలెం దగ్గరకు పలుమార్లు తిరిగిన స్పందించలేదని అన్నారు. అందుకు వీరు తమవద్ద వారి గోడును వెలిబుచ్చుకుంటు మేము నగరంలో ప్రస్తుతం ఉన్న ధరలలో ఇళ్ళకి బాడుగలు కట్టలేకున్నామని మాకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారాన్నరని అంటున్నారు. గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ వైకాపా ప్రభుత్వం టిడ్కో గృహాలను నిరుపేద ప్రజలకు పంపిణీ చేయకుండా జగనన్న గృహాల పేరుతో మరో మోసానికి తెర తీశారని అన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం సమయం ముగుస్తున్న ఇప్పటికీ ఎవి పూర్తి చేయక ప్రజలను మభ్య పెట్టారని.. వీటితోపాటు ఇక్కడ మంచినీటికి అరకొర పైపు లైను లు వేసి నీటి సరఫరాను ఇప్పటి వరకు వీరికి అందించలేదన్నారు. ప్రజలు ఈవిషయాలన్ని గ్రహించి జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేసి ప్రజా ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలని వెంటనే టిడ్కో గృహాల పంపినితో పాటు పలు ప్రజా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way