అంగన్వాడీ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైకాపా ప్రభుత్వం

    అనంతపురం ( జనస్వరం ) : వైకాపా ప్రభుత్వ బెదిరింపులకు భయపడి విషద్రావం త్రాగి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం నగరానికి చెందిన 9వనెంబర్ అంగన్వాడి సెంటర్లో సహాయకూరాలిగా పనిచేస్తున్నారు. డి.సరిత ని పావని హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి మనో దైర్యన్ని ఇచ్చిన జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 40 రోజుల నుంచి న్యాయపరమైన డిమాండ్ల అమలు కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు మరియు సహాయకుల ప్రధాన డిమాండ్లను వైకాపా ప్రభుత్వం అమలు చేయలేదు. విధులలో నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో సరిత తన ఉద్యోగం ఎక్కడ పోతుందో నన్న భయంతో తీవ్ర మనోవేదనకు గురై విషద్రావం త్రాగి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని అన్నారు. ఈ జగన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తూ ప్రజలపై కక్షగట్టి పరిపాలన సాగిస్తున్నాడని ఏ అంగన్వాడి కర్యకర్తకుడా తమ ఉద్యోగం పోతుందేమోనని భయపడవలసిన పనిలేదని ఇక 2నెలలు ఆగితే వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అని అన్నారు. మీ అన్ని రకాల డిమాండ్లను పరిష్కరించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way